schedule Thursday, May 21, 2026

వరి ధ్యానం కొనుగోలు కేంద్రం ప్రారంభం 

calendar_today May 9, 2026
person Prajagalam News
వరి ధ్యానం కొనుగోలు కేంద్రం ప్రారంభం 
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో మైల్వార్ గ్రామంలో కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (నావంద్గి) సెంటర్ ద్వారా వరి దాన్యం కొనుగోలు కేంద్రం పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రామి రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ వరి దొడ్డు రకం మద్దతు క్వింటాలుకు (ఎ) గ్రేడ్ ధర 2389 రూపా యలు,(బి)గ్రేడ్ క్వింటాలుకు ధర 2369 రూపాయలు,ప్రభుత్వం ప్రకటించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి,పిఎసిఎస్ డైరెక్టర్ ఎస్.హన్మంత్ రెడ్డి,ఖలీద్ బై,స్టాఫ్ అసిస్టెంట్ రాజశేఖర్,నరేష్, రైతులు,తదితరులు పాల్గొన్నారు