రైతువేదికలో ఆయిల్ పామ్ పంటపై అవగాహన సదస్సు.. ఉద్యానవన శాఖ అధికారి సంతోష్ కుమార్
May 4, 2026
Prajagalam News
(కుల్కచర్ల)
కుల్కచర్ల మండల కేంద్రంలోని రైతువేదికలో ఆయిల్ పామ్ పంట సాగు పై రైతులకు అవగాహన సదస్సును ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఉద్యానవన శాఖ అధికారి సంతోష్ కుమార్ ఒక సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ పామ్ పంట సాగు విధానం, సంరక్షణ, లాభదాయకత వంటి అంశాలపై రైతులకు వివరంగా తెలియజేయనున్నారు. మండలంలోని రైతులు ఈ అవగాహన సదస్సుకు హాజరై పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.