గ్రామాభివృద్ధికై ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా
ఆరు హైమాస్ట్ లైట్స్ ప్రారంభించిన సర్పంచ్ గందె ప్రవీణ్ కుమార్
గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని కుస్మసముద్రం సర్పంచ్ గందె ప్రవీణ్ కుమార్ అన్నారు.
గురువారం కుల్కచర్ల మండల పరిధిలోని కుస్మసముద్రం గ్రామంలో ఉగాది తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పలు వీధుల్లోని ప్రధాన కూడళ్లలో ఆరు ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరుణ రాజప్ప,మండల కార్యదర్శి గజ్జి లక్ష్మయ్య,ఉప సర్పంచ్ గుడిసె కృష్ణయ్య,మాజీ సర్పంచులు కేశవులు,మల్కయ్య,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పులి వెంకటయ్య,గజ్జి రాములు,బాల్ రెడ్డి, దోరెపల్లి శ్రీనివాస్,డ్యాగ శ్రీశైలం,గందే ప్రసన్న కుమార్,దొంగల చెన్నయ్య,వార్డు సభ్యులు, గజ్జి చంద్రయ్య,గజ్జి సురేష్,మోత్కూరు శ్రీనివాస్,దొంగల మైబయ్య,గందె శ్రీకాంత్,వడ్డే చెన్నయ్య వడ్డే శ్రీశైలం,పాణగారి కాలయ్య,దోరెపల్లి తిరుపతి,మోత్కూరి ఆనంద్,బొర్ర మోత్కూరి చంద్రయ్య,గజ్జి అంజిలయ్య,బొర్ర శాంతయ్య,పెంటయ్య ఉన్నారు.