తాండూర్ నూతన రెవిన్యూ డివిజనల్ అధికారినిగా బాధ్యతలు స్వీకరించిన కె. అనిత ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (బిఎస్ఆర్) మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి స్వాగతించారు.ఈ సందర్భంగా బి ఎస్ ఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తాండూర్ అభివృద్ధికి ఆమె సేవలు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తాండూర్ అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులకు అందేలా చూడాలని కోరారు. ఆర్డిఓ అనిత ఈ ఆత్మీయ స్వాగతానికి శ్రీనివాస్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.