schedule Thursday, May 21, 2026

అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల నిర్మాణం

calendar_today May 17, 2026
person Prajagalam News
అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల నిర్మాణం
 
  • ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టగల్ల ప్రశాంత్ మాదిగ
వికారాబాద్ జిల్లా-: జిల్లాలోని అన్ని గ్రామాలలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీల నిర్మాణం చేపడుతామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టగల్ల ప్రశాంత్ మాదిగ అన్నారు.ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కోడిగంటి మల్లికార్జున్ మాదిగ అధ్యక్షతన జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గట్టగల్ల ప్రశాంత్ మాదిగ హాజరయ్యారు.అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి గట్టగల్ల ప్రశాంత్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కోడిగంటి మల్లికార్జున్ మాదిగ మాట్లాడుతూ.... జులై 7నాటికి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల, గ్రామ కమిటీలు పటిష్టంగా నిర్మించాలన్నారు.అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మెలు పర్మినెంట్ గా నిర్మించాలని,రేపటి నుంచి జూలై 5వరకు అన్ని మండలాల ఇంచార్జీలు ఆ మండల పరిధిలోని అన్ని గ్రామాలకు గో టు విలేజ్ అనే కార్యాచరణతో నిత్యం గ్రామాల్లో మాదిగలతో మమేకం అవ్వాలని తెలిపారు. ముఖ్యంగా మాదిగ యువత విద్యపై ప్రత్యేక శ్రద్ధ ఉంచేలా వారికి స్ఫూర్తిని నింపాలని తెలియజేశారు.జులై 7నాటికి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కమిటీలు పటిష్టంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామిదాస్ మాదిగ, జిల్లా ఉప అధ్యక్షులు బి,కృష్ణ మాదిగ, జింగుర్తి నర్సింలు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ మాదిగ, జిల్లా కార్యదర్శి మహేందర్ మాదిగ, పూడూరు మండల అధ్యక్షుడు యేసు మాదిగ, జిల్లా సీనియర్ నాయకులు రవి మాదిగ, బంటారం మండలం ఇంచార్జి భరత్ మాదిగ, బాలరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు ఉన్నారు.