పేద కుటుంబాలకు ఆపత్కలంలో అండగా ఉంటా:- బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు వెంకట్
calendar_today
May 16, 2026
person
Prajagalam News
(ప్రజాగళం,కుల్కచర్ల)
పేద కుటుంబాలకు ఆపత్కాలంలో అండగా ఉంటానని బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు వెంకట్ అన్నారు. శనివారం కుల్కచర్ల మండల పరిధిలోని ఘనపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గోప్య నాయక్ తండాలో జరుప్ల భామిణి భాయ్ మృతి చెందడంతో విషయం తెలుసుకున్న యువ నాయకుడు వెంకట్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం రూ.5వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్ నాయక్, గణేష్, పాండు నాయక్, చందు, హన్మే నాయక్ తదితరులు పాల్గొన్నారు.