స్వామి వర్షం కురిసేలా కరుణించు,గ్రామస్థులు శివలింగానికి గంగతో అభిషేకం
July 14, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం పరిధిలో నవంద్గి గ్రామంలో వెలసిన శివలింగానికి 118 బిందెల నీటిని కగ్నా నది నుండి ఉదయం గ్రామస్థులు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసి స్వామి వర్షం కురిస్తేనే గ్రామాలు,ప్రజలు సంతోషంగా ఉంటారు. పంటలు పండుతావని,వర్షం పడే విధంగా ఆశీర్వదించు,కష్టాల నుండి కాపాడు స్వామి అని అభిషేకాలు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.